Sunday, May 5, 2024

AP | కార్పొరేట‌ర్ ప‌ద‌వికి శ్వేత రాజీనామా… త్వ‌ర‌లో పార్టీకి గుడ్ బై!

విజయవాడ: టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్​ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్‌ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.

ఈ సందర్బంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా తాను రాజీనామా చేశాన‌న్నారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని అన్నారు..తామ‌ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేద‌ని, టీడీపీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు తాము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాద‌నుకున్నామన్నారు. త్వ‌ర‌లోనే కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తారని శ్వేత వెల్ల‌డించారు.కాగా, కార్పొరేటర్ గా రాజీనామా చేసేముందు రాజకీయంగా తనకు సహకరించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌ని కలసి ధన్యవాదాలు తెలిపారు శ్వేత.

Advertisement

తాజా వార్తలు

Advertisement