Sunday, April 28, 2024

AP : చంద్ర‌బాబుకు పావుగా ష‌ర్మిల – మంత్రి రోజా

తిరుమల: నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావుడి చేస్తున్నారని సీరియస్‌ అయ్యారు మంత్రి రోజా.. తిరుమల శ్రీవారిని ఆమె నేడు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..’టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశార‌న్నారు. 6,100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారని వివ‌రించారు..

రాజకీయ అనుభవం లేని వైఎస్ షర్మిల రెండు పార్టీల మధ్య పావుగా మారి, జగనన్నపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు.
నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా, తెలంగాణకు వెళ్లి మీ బిడ్డను, అండగా ఉంటానని చెప్పిన ష‌ర్మిల ఈరోజు జగనన్నపై ఆరోప‌ణ‌లు చేస్తున్న‌దంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేద‌ని అంటూ, నిన్న ఆమె చేసిన హడావిడి చూస్తేనే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. షర్మిల ఆరాటాలు, పోరాటాలు చూస్తే ప్రజలకు ఇప్పటికే విషయం అర్థం అయిపోయిందన్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకం అన్నారు. ఇందులో షర్మిలను పావుగా వాడుకుంటున్నారన్నది అందరికీ అర్థమవుతోందని స్పష్టం చేశారు.

ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు ఎంత మంచోడో, వాళ్ళ అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్యకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో ఏదో పిచ్చి మాటలు తప్ప మరోటి లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన బిడ్డలు జగనన్నకు షర్మిలకు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా ఎప్పుడో రాసి, పంచిచ్చేశారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ఇలాంటి లేనిపోని పిచ్చి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాల‌ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము అంటూ హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement