Wednesday, May 8, 2024

Mangalagiri : రెండో రోజు ధ‌ర్మ‌యాగం.. పూజాకార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌

నేడు రెండో రోజు ధ‌ర్మ‌యాగం కొన‌సాగింది. ప‌వ‌ర్ స్టార్..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ యాగాన్ని చేప‌ట్టారు. రెండో రోజు కూడా పవన్ కల్యాణ్ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించిన పవన్ నియమనిష్ఠలతో పూజాదికాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్ర షురూ చేయనున్న సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పూజలతో వారాహి వాహనం ముందుకు కదలనుంది. ఈ యాత్రలో భాగంగా ముందుగా పవన్ క‌ల్యాణ్ కత్తిపూడి బహిరంగసభలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement