Thursday, April 25, 2024

Breaking: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థలు, టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, అలాగే తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం- నెల్లూరు – చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు ఉన్నాయి. అలాగే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు.. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement