Friday, May 3, 2024

వైసీపీ అభ్యర్థిగా సత్యవేణి నామినేషన్

స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లి ఎంపీటీసీకి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సత్యవేణి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో సత్యవేణి అత్తయ్య అయిన పిల్లి కోటేశ్వరి వైసీపీ తరపున ఎంపీటీసీగా పోటీచేయడం, ఎన్నికల లెక్కింపు సమయానికి ఆమె కరోనాతో మృతి చెందింది. అయితే ఎన్నికల లెక్కింపులో కోటేశ్వరి గెలుపొందటంతో అధికారులు ఎన్నికను రద్దు చేసారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 15న ఉప ఎన్నిక నిర్వహిస్తుండటంతో వైసీపీ తరపున కోటేశ్వరి కోడలైన సత్యవేణి నామినేషన్ ను ఎన్నికల అధికారి అయిన‌ నేతల మల్లి ఖార్జున రావుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, జ‌డ్పీటీసీ బూడిద వరలక్ష్మి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసంశెట్టి వరలక్ష్మి, నాయకులు నేతల నాగరాజు, దొమ్మేటి సత్య మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement