Saturday, May 18, 2024

అక్టోబర్‌ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : అక్టోబర్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అయితే వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శన మాత్రమే ఉంటుందని టీటీడీ ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబర్‌లో బ్రహ్మోత్సవం తేదిల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నిలిపివేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్‌ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement