Friday, May 17, 2024

ఈనెల 29న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష .. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌-2022 ఈ నెల 29న జరగనుంది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ అయిన పాలిసెట్‌.ఏపీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌ లేదా మనబడి.సీవో.ఐఎన్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా నమోదు చేసుకున్న మొబైల్‌ నంబర్‌ ఇవ్వడం ద్వారా అడ్మిట్‌ కార్డు పొందవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement