Wednesday, May 1, 2024

Condolence – రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు దుర్మరణం బాధాకరం – ప‌వ‌న్ క‌ల్యాణ్

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎపికి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం ఆవేదన కలిగించింద‌ని జ‌నసేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ అన్నారు. మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పేద కుటుంబాలకు చెందిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని కోరారు. తగినంత నష్ట పరిహారం అందించాల‌ని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల ప్రాంతానికి చెందిన వీరంతా ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ‌ని, తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement