Saturday, April 27, 2024

AP: ఇవాళ విశాఖలో నేవీ మిలన్-2024…సాగరతీరన విన్యాసాలు…

విశాఖలో నేవీ మిలన్- 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరుకానున్నారు. నేటి నుంచి 27 వరకు విశాఖ వేదికగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది.

మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ రెండేళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మిలన్-2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్​లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్​లో వివిధ దేశాలకు సంబందించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్దావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్​ను ఏర్పాటు చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement