Friday, May 17, 2024

బ్రోతల్ హౌస్ పై మెరుపు దాడి.. వ్యభిచారం చేస్తున్న ముగ్గురు అరెస్ట్

పొన్నూరు రూరల్ (ప్రభ న్యూస్ ): ఏపీలోని గుంటూరు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు బ్రోతల్ సెంటర్ పై మెరుపు దాడులు చేశారు.. పొన్నూరు పరిధిలోని కట్టెముపూడి అడ్డారోడ్డు లోని ఒక గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మండల పరిధిలోని కట్టెమ పూడి అడ్డరోడ్డు సమీపాన మహిళ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని దానిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎస్ఐ భాగ్యరాజు కి సమాచారం అందింది.. దీంతో తన సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి ఆ ఇంటి పై దాడి చేశారు. ఆ ఇంట్లో విటుడు సురేష్ తో పాటు ఇద్దరు మహిళలను ఎస్సై అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 వేలు రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాగ్యరాజు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement