Thursday, May 9, 2024

కర్నూలులో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. పుల్లగుమ్మి గ్రామంలో ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. బాలకను చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే, బాలిక కేకలు విని చుట్టూ పక్క పొలాల వారు రావడంతో బాలిక నోరు మూసి చంపేందుకు ప్రయత్నించాడు. గుంపులో వ్యక్తులు కేకలు వేయడంతో కామాందుడు బాలికను వదిలి పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement