Thursday, July 25, 2024

బస్సులో గంజాయి రవాణా.. బీహార్ వాసి అరెస్ట్

కర్నూలు నగర శివార్లలోని పంచలింగల అంతరాష్ట్ర సరిహద్దు భారీగా గంజాయి పట్టుబడింది. బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్ పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారు జామున సెబ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బీహార్ లోని బొహనపురు కు చెందిన ఎండి. రాహుల్ అనే వ్యక్తికి చెందిన బ్యాగ్ లో సోదాలు నిర్వహించగా.. సుమారు రెండు కిలోలకు పైగా  ప్యాక్ చేసిన గంజాయిని గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement