Saturday, May 4, 2024

Nirmala Sitharaman: నేను చిన్న‌ప్ప‌టి నుంచి తెలుగు వింటూ జీవించాను…

తాను చిన్నప్పటి నుంచీ తెలుగు వింటూ జీవించానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనంలో ఆమె పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ దేశ విదేశాల్లో గుర్తింపు రావాలంటే చెన్నె, తమిళనాడు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేద‌న్నారు. మొవ్వ, తంజావూరు, రాజమండ్రి, బొబ్బిలి లాంటి ప్రాంతాలు ప్రతి వారు గుర్తుంచుకోవాలని. కార్తీక మాసంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. ఈ గానామృతం ప్రతీ సంవత్సరం దేశ విదేశాలకు వెళ్ళాలని, తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో సంగీతం నేను ఆస్వాదించానని, సంగీతాన్ని వైద్యంలో కూడా వినియోగిస్తున్నార‌ని చెప్పారు. విదేశాల నుంచీ తెలుగువారు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement