Saturday, July 27, 2024

AP: న్యాయవాది దారుణ హత్య…

శ్రీ సత్య సాయి బ్యూరో, మే 30 (ప్రభన్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన యువ న్యాయవాది సంపత్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం యువ న్యాయవాది మృతదేహం ధర్మవరం సమీపంలోని చెరువు వద్ద గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్ యు ఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ ను హిందూపురం ప్రాంతంలో హత్య చేసి, అనంతరం సుమారు 60, 70 కిలోమీటర్ల దూరంలో గల ధర్మవరం చెరువు ప్రాంతంలో పడవేయడం జరిగింది.

యువ న్యాయవాదిగా, యువ నాయకుడుగా హిందూపురం ప్రాంతంలో పేరొందిన సంపత్ కుమార్ హత్య పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement