Friday, April 26, 2024

వైసీపీ ఎమ్మెల్యేతో లగడపాటి భేటీ.. రాజకీయాల్లో రీఎంట్రీ కోసమేనా?

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సడన్ గా తెరపైకి వచ్చాడు. ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ తాజా కేబినెట్ భేటీపై చర్చించినట్లు సమాచారం. ఆయన వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ తో భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. అయితే లగడపాటి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే లగడపాటి కొద్దిసేపటి క్రితం ఖమ్మం చేరుకున్నాడు. దీంతో ఖమ్మం పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఎవరితో భేటీ కానున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement