Friday, May 17, 2024

17న‌ కర్నూలుకు సీఎం జగన్‌.. ఓర్వ‌క‌ల్లులో ప‌ర్య‌టన‌కు ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గుమ్మటం తండా వద్దగల గ్రీన్‌కో ప్రాజెక్టు ప్రాంగణానికి చేరుకుని భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.05 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement