Sunday, April 28, 2024

గంజాయి పట్టివేత .. బీహార్ వాసి అరెస్ట్

కర్నూల్ జిల్లా, కర్నూల్ నగర శివార్లలోని పంచలింగల అంతరాష్ట్ర సరిహద్దు సబ్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారు జామున సిఐ మంజుల, ఎస్ఐ. గోపాల్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో సోదాలు చేస్తుండగా బిహార్ రాష్టం బొహనపురు జిల్లాకు చెందిన ఎండి. రాహుల్ బ్యాగ్ లో గంజాయి దొరికింది. సుమారు 2 కిలోలకు పైగా ప్యాక్ చేసిన గంజాయినీ గుర్తించారు. పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి గంజాయినీ కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement