Tuesday, April 30, 2024

AP: 16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి…సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య

(ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్): కేంద్రంలో మోదీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు. సమ్మె సన్నాహకంలో భాగంగా ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామికవాడలో ఆయిల్ అండ్ గ్యాస్ డ్రైవర్లతో బుధవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు నష్టదాయకమైన, ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు జరిమానా జైలు శిక్ష విధించడం పై ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోడ్లు బాగు చేయాలని, డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న డ్రైవర్ల పై ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు తీసుకురావడం డ్రైవర్లతో స్టీరింగ్ బంద్ చేయించడం తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్లు, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు నష్టదాయకమైన చట్టాలను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం.మహేష్, హెచ్ పీసీఎల్ ఆయిల్ డ్రైవర్స్ యూనియన్ అండ్ సీఐటీయూ మండల అధ్యక్షుడు ఎన్.సుందర రావు, కార్యదర్శి బాలకృష్ణ, హెచ్ పీసీఎల్ ఆయిల్ సెక్రటరీ శేషగిరి, కోశాధికారి గోవర్ధన్, హెచ్ పీసీఎల్ గ్యాస్ డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఐఓసీఎల్ ఆయిల్ (సీఐటీయూ) ప్రెసిడెంట్ కృష్ణ, సెక్రటరీ శేషు, బీపీసీఎల్ ఆయిల్ యూనియన్ (సీఐటీయూ) ప్రెసిడెంట్ కృష్ణ, సభ్యుడు శివకృష్ణ, హెచ్ పీసీఎల్ ఆయిల్ డ్రైవర్ యూనియన్ నాయకులు సుబ్బారావు, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement