Saturday, April 27, 2024

కియాకి ఇండియ‌న్ కార్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 అవార్డ్.. అభినంద‌న‌లు తెలిపిన చంద్ర‌బాబు

ఇండియ‌న్ కార్ ఆఫ్ ది ఇయ‌ర్2023 అవార్డును సొంతం చేసుకుంది కియా.. కాగా కియా కేరెన్స్ వేరియంట్ కి ఈ అవార్డు ద‌క్కింది.ఈ సందర్భంగా కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అనంతపురం ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న కేరెన్స్ వేరియంట్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇది గర్వించదగ్గ తరుణమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కియా పరిశ్రమ ఫొటోలు, ట్రయల్ ప్రొడక్షన్ సెరెమొనీ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏపీకి తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement