Tuesday, July 23, 2024

Jana Sena – అయిదు కోట్ల మంది ఆశ‌లు మ‌న‌పైనే…. ప‌వ‌న్ కల్యాణ్

రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకుగాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు.
అమ‌రావ‌తిలో జ‌రిగిన కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తుచేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement