డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా అనంతబాబు ఉన్నారు.
- Advertisement -