Friday, May 3, 2024

Inner Ring Road case : నారాయణ భార్యతో సహా నలుగురిపై కేసు

ఏపీ సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా… ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని సీఐడీ నిందితులుగా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రాపూరి సాంబశివరావును సీఐడీ నిందితులుగా చేర్చింది. ఈ క్రమంలో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement