Friday, April 19, 2024

ఇల్లీగ‌ల్ ఎఫైర్‌.. అనంత‌పురంలో కొడ‌వ‌లితో న‌రికి చంపేశారు..

అనంత‌పురం జిల్లాలో దారుణం జ‌రిగింది. కామరపల్లి సమీపంలో రాజేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొడవలితో గొంతుకోసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం శివారు నందమూరి నగర్ కు చెందిన రాజేష్ తాపీ మేస్త్రి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వేరే మహిళతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోందని గొడవలు జరిగినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.

నిన్న రాత్రి స్నేహితులతో కలిసి రాత్రి 8 గంటల సమయంలో మద్యం తాగ‌డానికి కామర్ పల్లి ద‌గ్గ‌రికి వెళ్లి అక్కడ కొత్తగా వెంచర్ వేసిన గ్రౌండ్ లో స్నేహితులు గురుమూర్తి, బాలరాజు కలసి మద్యం సేవించారు. మద్యం మత్తులో కొడవలితో దాడి చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామ‌ని రూరల్ ఇంచార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement