Sunday, April 28, 2024

AP : ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని బలవన్మరణం

ఏపీలో ట్రిపుట్ ఐటీ విద్యార్థిని బ‌ల‌వన్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది.

ఆదివారం రాత్రి ఆమె హాస్టల్‌ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమెకు కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడింది.
తోటి విద్యార్థులు, ట్రిపుల్‌ఐటీ సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం ట్రిపుల్‌ఐటీలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఆమె మృతి చెందారు. ఇంజినీరింగ్‌కోర్సు పూర్తిఅయ్యింది. మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కుమారస్వామిగుప్త, హాస్టల్‌ సంక్షేమాధికారి ఇమ్రాన్‌షరీఫ్‌ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు విద్యార్థిని చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement