Tuesday, April 30, 2024

AP | కొడుకు, బిడ్డ పేరు మీద ఇడుపులపాయ భూములు.. రిజిస్ట్రేషన్ చేసిన షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, బిడ్డ పేరు మీద‌ రిజిస్ట్రేషన్ చేశారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఇవ్వాల (శుక్ర‌వారం) హైదరాబాద్ నుండి ఇడుపులపాయ వెళ్లారు. కడప విమానాశ్రయం నుండి వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని రిజిస్ట్రేష‌న్ తంతు పూర్తి చేశారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు.

ఇక‌.. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వారి కుటుంబం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుంది. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు నివాళులు అర్పించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement