Saturday, May 18, 2024

ఏపీలోని ఆ ఆరు జిల్లాల్లో రేపు భారీ వ‌ర్షాలు

ఆగస్టు 4వ తేదీన (గురువారం) ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంద‌ని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం తదితర ఆరు జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశముంద‌ని అంచనా వేసింది. ఇందులో శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బుధవారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement