Wednesday, May 1, 2024

మాలకొండారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు.

తాడేపల్లి,ఫిబ్రవరి19(ప్రభ న్యూస్) – తాడేపల్లి పట్టణం, సుందరయ్య నగర్ లీలాసుందరయ్య కళావేదిక వద్ద వెన్నపూస మాలకొండారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో తాడేపల్లి రామ్ హాస్పిటల్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు బీపీ, షుగర్ మరియు ఇతర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్యాంపు ముగింపు సందర్భంగా మాలకొండారెడ్డి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ల బృందాన్ని సత్కరించి శ్రీ శ్రీ మహాప్రస్థానం పుస్తకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఎస్. వెంకటరావు, కొట్టే కరుణాకరరావు, సిహెచ్. బుజoగరావు, శేఖర్, షేక్. భాష, కొట్టె ప్రభాకరరావు, వి. రామకృష్ణ, కొట్టె కొండబాబు, సుధ, బేబీ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement