Thursday, May 2, 2024

ఎర్రం నాయుడికి టిడిపి శ్రేణులు ఘన నివాళి

తెనాలి, ఫిబ్రవరి 23 ప్రభ న్యూస్ : తెలుగుదేశం పార్టీ వాణిని దేశవ్యాప్తంగా గుర్తించేట్టు పార్లమెంట్ లో బలమైన గొంతుక దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అని టిడిపి నేతలు కొనియాడారు. గురువారం టిడిపి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి స్థానిక టిడిపి కార్యాలయంలోనిర్వహించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్ , నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గిరి గణేష్, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నా రావు లు మాట్లాడుతూ ఎర్రం నాయుడు పార్టీకి, ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేసిన సేవలనుకొనియాడారు.కార్యక్రమంలో పార్టీ నేతలు మొహమ్మద్ ఖుద్దూస్, గుమ్మడి ప్రసాద్ , కంచర్ల ఏడుకొండలు, మల్లవరపు విజయ్, గడ్డేటి రాజా, కంచర్ల భూషణం, కటేవరం గిరి,కన్నయ్య, కుదరవల్లి శ్రీనివాసు,అన్నం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement