Saturday, May 18, 2024

స్విమ్మింగ్ పూల్ కోచ్ ను అభినందించిన డిఐజి

స్విమ్మింగ్ లో ప్రతిభ కనబ‌రచిన మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన స్విమ్మింగ్ కోచ్ ను గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమ్ వర్మ అభినందించారు. మార్చ్ 27వ తేదీన గోవాలో జరిగిన జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ కోచ్ షేక్ ఖాజా మొహిద్దిన్ పాల్గొని, 4కిలోమీటర్లను కేవలం 01:18:30 సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో విజయం సాధించారు. మంగళవారం గుంటూరు సిటీలోని రేంజ్ డిఐజి కార్యాలయంలో స్విమ్మింగ్ కోచ్ ఖాజా మోహిద్దీన్ గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మని మర్యాదపూర్వకంగా కలిశారు. డిఐజి స్విమ్మింగ్ పూల్ విజేతకు మెమోంటో అందజేసి అందజేశారు. భారత దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో తమ స్విమ్మింగ్ కోచ్ షేక్ ఖాజా మొహిద్దిన్ పాల్గొని ప్రథ‌మ స్థానం సాధించటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జాతీయస్థాయి గుర్తింపు పొందిన పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకురావాలని గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమ్ వర్మ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement