Saturday, July 27, 2024

బ‌డ్జెట్ సమావేశాల‌పై స‌మాచారం లేదు – స్పీక‌ర్

గుంటూరు: ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి తనకు ఇంత వ‌ర‌కు సమాచారం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని నేడు స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అవసరమైతే ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. అసెంబ్లీలో సమయం వృధా అవుతున్న మాట వాస్తవమే అంటూ స్పీకర్‌గా తనకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ గందరగోళ సమయంలో సభ్యుల విచక్షణకే వదిలేస్తున్నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement