Tuesday, July 23, 2024

AP : ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను ఇవాళ నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది.గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడీ తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

మొత్తం 1,327 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వహణకు అధికారులు సిద్ధం చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్ లకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్ ఆబ్జెక్టీవ్ తరహాలో ఆప్ లైన్ లో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు రెండున్నర గంటల్లో ఓఎంఆర్ షీట్ పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement