Sunday, May 5, 2024

Nandyala: పేలిన గ్యాస్ సిలిండర్… ఐదుగురికి గాయాలు

నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటి గోడలు కూలాయి. వెంటనే గమనించిన కాలనీ వాసులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement