Monday, April 29, 2024

AP: జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ….

రాజోలు – టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు.

ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. దీంతో నిరాశలో గొల్లపల్లి పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఇదిలా ఉంటే గొల్ల‌ప‌ల్లి గ‌త రాత్రి ఎంపీ కేశినేని నానితో భేటి అయ్యారు.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆయ‌న చ‌ర్చించారు… ఈ సంద‌ర్భంగా నానీ అయ‌న‌ను వైసీపీలోకి రావల‌సిందిగా ఆహ్వానించారు..

వైసిపిలో చేరిన గొల్ల‌ప‌ల్లి ..

తెలుగు దేశం పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో సూర్యారావు కండువా కప్పుకున్నారు. జ‌గ‌న్ ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement