Saturday, May 18, 2024

క్రీడాకారులకు ప్రోత్సాహం.. మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమి ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ: క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి షేక్‌ సాదియా అల్మస్‌ మంగళవారం అసెంబ్లి ఆవరణలో ఛాంబర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ను కలుసుకున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించినట్లు వివరించారు.

ప్రభుత్వం తరపున ఆమెకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలోపర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, షేక్‌ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement