Tuesday, April 16, 2024

వృద్ద దంపతుల ఆత్మహత్య.. అనారోగ్యమే కారణం

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో ; మనిషి మనుగడ సాధించాలంటే తన ఆరోగ్యం కూడా సహకరించాలి. అప్పుడే మనిషి మనుగడ సాధ్యమవుతుంది. కానీ, ఆ వృద్ద జంట అలా అనుకోలేదు. ఎవరికీ భారం కాకూడదు అనుకున్నారు. ఎవరితో సేవ చేయించుకోవాలనుకోలేదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు.. వారి పనులు వారు చేసుకోవడం భారం అవుతుండటంతో వారు తనువు చాలించిన ఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కట్టావారిపాలెంలో సోమవారం చోటు చేసుకుంది.

అద్దంకి మండలంలోని కట్టావారిపాలెంకు చెందిన కట్టా వెంకయ్య (81), కట్టా వెంకాయమ్మ (70) దంపతులకు ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు. అయితే వారు వయసు రీత్యా వృద్ధులు కావడంతో అనారోగ్యానికి గురయ్యారు . వారికి వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడం, కుమారులు సరిగా చూడకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. కుమార్తె కూడా ఇటీవల మృతి చెందడంతో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దీంతో ఈ సమాజంలో మనం బతికి ఉన్నా ప్రయోజనం ఏముంద నుకున్నారో ఏమో.. ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి భార్యభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement