Monday, October 21, 2024

AP | సీఎం సహాయ నిధికి విరాళం.. ఏడాది జీతం, అలవెన్స్ ప్రకటించిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలకపొడి శ్రీనివాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన కొలికపూడి శ్రీనివాస్… తన ఎమ్మెల్యే జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహకందని స్థితికి పడిపోయిందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని, కొత్త ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడనున్నాయని అన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యునిగా తన జీతం, ఇతర అలవెన్స్‌లను ముఖ్యమంత్రి సహాయ నిదికి ఏడాది పాటు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

ఎన్నికల ముందు నుంచి తన సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తన వేతనాన్ని అలవెన్స్‌లను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయడం పట్ల సర్వత్ర హర్షం అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement