Sunday, April 28, 2024

AP | డ్వాక్రా గ్రూపులపై ఈసీ ఆంక్షలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డ్వాక్రా గ్రూపులను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు, కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా లేదా సమూహాలుగా SHGలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోకూడదని. అవగాహన పేరుతో సమావేశాలు, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించవద్దని సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్లను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement