Sunday, April 28, 2024

ఏపీలో నేడు విద్యార్థుల‌కు ఈ ట్యాబ్ ల పంపిణీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 11 గంటలకు జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించాలని గతంలోనే నిర్ణయించారు.

పాఠశాలల్లో సాంప్రదాయ పద్దతుల్లో కాకుండా సరికొత్త ఈ-లెర్నింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగానే ఈ-ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు లబ్ది చేకూరనున్నట్లు అధికారులు తెలిపారు. శాంసంగ్ సంస్థ తయారు చేసిన ఈ ట్యాబ్‌లలో బైజూస్‌కు చెందిన ఎడ్యుకేషన్ మెటీరియల్ ఉచితంగా లభించనున్నది. ఈ కంటెంట్ కోసం ప్రభుత్వం రూ. 686 కోట్లు ఖర్చు చేసింది. కానీ విద్యార్థులకు ట్యాబ్, కంటెంట్ ఉచితంగానే అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement