Friday, May 3, 2024

అప్పులే శాపాలై.. రైతు ఆత్మహత్య..

తుగ్గలి, (ప్రభ న్యూస్‌) : మండల పరిధిలోని రాతన గ్రామంలో మాల సుంకన్న (55)అనే రైతు అప్పుల బాధ భరించలేక నిన్న సాయంత్రం తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాతన గ్రామంలో తనకున్న రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగుచేసి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన పత్తి పొలం ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిని చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న సుంకన్నకు రూ.10లక్షలు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్‌ఐ షమీర్‌భాష కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement