Thursday, May 2, 2024

AP: ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సందర్శించిన సీఎం వైఎస్ జగన్

కడప- ప్రభ న్యూస్ బ్యూరో : మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించడంతో తనజన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చద్దార్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనంద పరవశులయ్యారు. ఈ దర్గా ఖ్యాతీ, మహిమలు.. ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణమన్నారు. తాను పుట్టిన సొంత జిల్లాలో.. ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతకు మించి ఆమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధారిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో.. అర్హులైన అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న.. మిత్రుడు ఎస్.బి.అంజాద్ బాషాకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.


ఈ కార్యక్రమంలో.. బద్వేల్ ఆర్డీవో వెంకట రమణ, డీఎస్పీ షరీఫ్, దర్గా మేనేజర్ ఎస్ఎండీ అలీఖాన్, ముజూవర్ అమీర్, దర్గా కో ఆర్డినేటర్ కుతుబుద్దీన్, హజ్ హౌస్ చైర్మన్ గౌసుల్లాజం, ఉర్దూ అకాడెమీ ఛైర్మెన్ నదీమ్, వేర్ హౌస్ ఛైర్మెన్ కరీముల్లా, అహమ్మద్, స్టేట్ మైనారిటీ కమీషన్ మెంబర్ హిదియతుల్లా, నాయకులు అహమ్మద్ భాష, షేక్ ఉమెర్, సయ్యద్ జైద్, డా.సోహేల్, అఫ్జల్ ఖాన్, స్థానిక, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, దర్గా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement