Sunday, April 28, 2024

AP: విశాఖ‌లో సీఎం ప‌ర్య‌ట‌న‌…శారదా పీఠంలో జగన్ ప్ర‌త్యేక పూజ‌లు…

సీఎం జ‌గ‌న్ ఇవాళ విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. చిన‌ముషిడివాడ‌లోని శార‌ద పీఠాన్ని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆధ్యాత్మీక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. పీఠంలోని దేవ‌తామూర్తుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు.

- Advertisement -

ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్నారు. సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్ ఫోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ ఫోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి వెళ్తారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రాజశ్యామ యాగంలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు పీఠంలో జరుగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం పాలు పంచుకుంటారు. అనంతరం విశాఖ ఎయిర్ ఫోర్ట్ కి చేరుకొని గన్నవరం బయలుదేరుతారు. సీఎం జగన్ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం ను చూసేందుకు ప్రజలు భారీ రానుండటంతో బారీకేడ్లు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement