Sunday, May 26, 2024

వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ ఉత్సవానికి సీఎం జ‌గ‌న్ కు ఆహ్వానం

తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ వద్ద)లో నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గన్మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి క‌లిసి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement