Wednesday, April 17, 2024

నలుగురు విద్యార్థులు మిస్సింగ్..

తిరుపతి సిటీ : తిరుపతి మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు బాలలు మంగళం జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.. విద్యార్థులు స్కూలుకు వెళ్లకుండా ఎక్క‌డికి వెళ్లారో తెలియ‌డం లేదు. దీంతో వారి తల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన పిల్లలు వివరాలు ఇలా ఉన్నాయి.. న‌లుగురు విద్యార్థులు గతమ్మోహోత్ పాఠశాలలో బయలుదేరి వారు స్కూలుకు వెళ్లకుండా కపిల తీర్థం వెళ్లారు. అక్కడి నుంచి వారు లీలామహల్ సర్కిల్ కు వచ్చారు. ఆ తర్వాత నలుగురు విద్యార్థులు ఆచూకీ కనబడలేదు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి ఎస్సై ఇమ్రాన్ గురువారం తెలిపారు. ఈ విద్యార్థులు అదృశ్యం కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలు పరిశీలించి జరుగుతున్నదని వివరించారు. ఎక్కడైనా ఎవరికైనా విద్యార్థులు సమాచారం తెలిస్తే అలిపిరి పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement