Monday, April 29, 2024

స‌బ్‌స్టేష‌న్ మెటీరియ‌ల్ చోరీచేసిన‌ నిందితుల అరెస్టు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ ను దొంగిలించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన‌ట్టు చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. శనివారం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 1,33,92,108 విలువ కలిగిన మెటీరియల్ ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో నండూరి శివప్రసాద్, తలశిల నరేష్, లాలాపేట జ్ఞాన ప్రకాష్‌ని అరెస్టు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

తిరుపతి రూరల్ మండలం చెన్నాయిగుంట గ్రామం వద్ద కొత్తగా 132/33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంద‌ని, అక్కుడున్న మెటీరియల్‌ని సబ్ కాంట్రాక్టు చేస్తున్నామని చెప్పి, సెక్యూరిటీ గార్డును బెదిరించి లారీలో లోడ్ చేసుకుని వెళ్లిన‌ట్టు వివరించారు. దీనిపై అందిన ఫిర్యాదు మేర‌కు తిరుచానూరుపోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామ‌న్నారు. కేసు దర్యాప్తు చేసి నిందితుల‌ను అరెస్టు చేసి వారి నుంచి మెటీరియ‌ల్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దొంగతనం కేసులో ఎవరెవరు ఉన్నారు అని దానిపై కూడా విచారిస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement