Monday, May 13, 2024

AP: చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ తిరస్కరణ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడుసార్లు ములాఖత్‌ను పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు అనుమతించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement