Friday, May 3, 2024

AP: 17న రాజధాని రైతుల బహిరంగ సభ.. పాల్గొన‌నున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఈనెల 17న అమరావతిలో రాజధాని రైతులు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు కావొస్తున్న సందర్భంగా రైతులు సభను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట సభను నిర్వహించేందుకు రైతులు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సభా ఏర్పాట్లపై ఇవాళ అమరావతి, తుళ్లూరు రైతులు సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement