Wednesday, July 24, 2024

Calling …. ఓ అన్నా .. చంద్ర‌న్నా! …. కాన్వాయ్ వెంట‌ మహిళ ప‌రుగులు.. వీడియోతో

కాన్వాయ్‌ని దాటుకుని వ‌చ్చేసిన అభిమానం
బెజ‌వాడ‌లో క‌నిపించిన అరుదైన‌ దృశ్యం
కాన్వాయ్ స్పీడ్‌గా వెళ్తున్నా వెంటప‌డ్డ మ‌హిళ‌
మ‌న‌ప‌ల్లి వాసి.. నందిని సాహ‌సం
కాళ్లు మొక్కుతా అంటే వారించిన బాబు
జ్వ‌రం వ‌చ్చినా.. చూడాల‌ని వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డి
ట్రీట్‌మెంట్ అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచ‌న‌

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఏపీలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబును చూసేందుకు బెజవాడలో తెలుగుతమ్ముళ్లు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి.. ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని.. తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు.

- Advertisement -

మీ కాళ్లు మొక్కుతా అన్నా..

సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు చంద్ర‌బాబు. మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సారూ.. ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతా.. అంటూ ఆ మహిళ అనగా… చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చానని నందిని చెప్పగా.. ముందు ఆస్ప‌త్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement