Tuesday, April 30, 2024

Brutality – క‌న్న‌త‌ల్లి అమానుషం…18 రోజుల పసికందు దారుణ హ‌త్య

నంద్యాల క్రైమ్, అక్టోబర్ 10, (ప్రభా న్యూస్): 18 రోజుల మగ బిడ్డను కన్నతల్లి గొంతు కొరికి, కత్తితో పొడిచి బలి తీసుకుంది. పట్టణంలోని గాంధీనగర్ కు కోల మహేష్, షానున్ బీ అనే దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. మంగళవారం తల్లి షానున్ బీ 18 రోజుల బిడ్డను గొంతు కొరికి కత్తితో పొడిచి బలి తీసుకుంది. అరుపులు విన్న స్థానికులు పరుగులు తీసి వెళ్లి చూడగా శిశువు మరణించింది. తల్లి అయిన షానున్ బీ బిడ్డను విసిరేసింది. అనంతరం షానున్ బీ ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నరసింహులు మృతి చెందిన 18 రోజుల బిడ్డను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement