Monday, July 22, 2024

AP: విద్యుత్ షాక్ తో అన్నదమ్ముల మృతి…

పశ్చిమ ప్రకాశం ప్రతినిధి, ప్రభన్యూస్ : ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం చోటుచేసుకుంది. టాటా ఏస్‌ వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి అన్నదమ్ములు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద జరిగిందీ ఘటన. మృతులు గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన లోకి(17), సాయి(14)లుగా గుర్తించారు. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తీసుకువచ్చి తిరిగి వాటిని తరలిస్తున్న సమయంలో ఆటోకు నీటి బోరుకు సంబంధించిన విద్యుత్తు వైర్ తాకింది.

దీంతో విద్యుత్తు ఆటోకు సరఫరా కావడంతో షాక్​ కొట్టి ఆటోలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్​కు గురైన వారిని కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement