Sunday, April 28, 2024

AP: బ్రెయిన్‌ డెడ్‌.. అవయవదానంతో నలుగురికి ప్రాణదానం..

కర్నూల్ ప్రతినిధి : కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి (38) తాను మరణించినా.. నలుగురికీ ప్రాణదానం చేసింది. శనివారం కర్నూలు నగరంలోని కిమ్స్ వైద్యశాలలో మరోసారి అవయవ దానానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఇవాళ‌ బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుండి గుండె, లివర్, రెండు కిడ్నీలు తీసి నలుగురి ప్రాణదానానికి మరోసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మధ్యనే పావని లత తన మరణంలో కూడా అవయవ దానం ద్వారా నలుగురికి ప్రాణ దానం చేసిన విషయం విదితమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement